ఆరడుగుల కేకుతో మారడోనాకు వినూత్న నివాళి

ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. పైగా ఫుట్‌బాల్‌కు పెద్దగా ఆదరణ లేని భారత్‌లోనూ డిగోను ఆరాధించేవారు అనేక మంది ఉన్నారు.

Published : 28 Dec 2020 22:56 IST

చెన్నై: ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనాకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. పైగా ఫుట్‌బాల్‌కు పెద్దగా ఆదరణ లేని భారత్‌లోనూ డిగోను ఆరాధించేవారు అనేక మంది ఉన్నారు. తాజాగా.. తమిళనాడులోని రామనాథపురానికి చెందిన ఓ బేకరీ యజమాని వినూత్న రీతిలో మారడోనాకు నివాళి అర్పించారు.  క్రిస్మస్‌, నూతన సంవత్సరం సందర్భంగా డిగో నిలువెత్తు కేక్​ను రూపొందించి దుకాణం ముందు ప్రదర్శనకు ఉంచారు. నాలుగు రోజులు శ్రమించి.. 60 కిలోల చక్కెర, 270 గుడ్ల వినియోగించి ఆరు అడుగుల మారడోనా రూపంలో ఉన్న కేకు రూపొందించారు. ప్రస్తుతం ఈ కేక్‌ సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది.

‘ఏటా మేము ప్రముఖుల విగ్రహాల కేకులను తయారు చేస్తాం. ఇప్పటికే ఇళయరాజా, అబ్దుల్‌కలాం, భారతీయార్‌ సహా పలువురి కేకులను రూపొందించాం. క్రికెట్​కు సచిన్, వంద మీటర్ల పరుగుకు బోల్ట్​, బాక్సింగ్​కు మైక్​ టైసన్​ ఎలాగో.. ఫుట్​బాల్​ అనగానే మారడోనా గుర్తుకొస్తాడు. ఈ కేక్​ ఆయనకు నివాళిగా తయారు చేశాం. అలాగే పిల్లలు ఫోన్లలో కాకుండా ఆరుబయట ఆడుకోవాలని ప్రోత్సాహిస్తున్నాం’ అని బేకరీ యజమాని సతీశ్ రంగనాథన్ తెలిపారు. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న డిగో మారడోనా.. గత నవంబరు 25న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని