నేను బాలేను.. బాధగా ఉంది: యువీ

టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ను కెవిన్‌ పీటర్సన్‌ మరోసారి ట్రోల్‌ చేశాడు. ఆదివారం ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ ఎఫ్‌ఎ కప్‌ సెమీఫైనల్లో చెల్సీ జట్టు మాంచెస్టర్‌ను 3-1 తేడాతో ఓడించింది...

Published : 20 Jul 2020 14:01 IST

మరోసారి ట్రోల్‌ చేసిన కెవిన్‌ పీటర్సన్‌

లండన్‌: టీమ్‌ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ను కెవిన్‌ పీటర్సన్‌ మరోసారి ట్రోల్‌ చేశాడు. ఆదివారం ఇంగ్లాండ్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ ఎఫ్‌ఏ కప్‌ సెమీఫైనల్లో చెల్సీ జట్టు మాంచెస్టర్‌ను 3-1 తేడాతో ఓడించింది. దీంతో చెల్సీకి వీరాభిమాని అయిన పీటర్సన్‌.. మాంచెస్టర్‌ అభిమాని అయిన యువరాజ్‌ సింగ్‌ను ఆటపట్టిస్తూ ట్వీట్‌ చేశాడు. ‘హాయ్‌ యువీ.. నువ్వు బాగానే ఉన్నావా?’ అని అడిగాడు. దానికి స్పందించిన మాజీ ఆల్‌రౌండర్‌ ‘లేదు పీటర్సన్‌ నేను బాలేను. బాధగా ఉంది’ అని సరదాగా బదులిచ్చాడు. 

పీటర్సన్‌ మళ్లీ ఇంకో ట్వీట్‌ చేస్తూ.. ‘మాములుగానే చెక్‌ చేస్తున్నా. కొన్ని వారాల క్రితం చాలా మాట్లాడుకున్నాం. ఇప్పుడు కూడా నీకు మాట్లాడాలని ఉందా?నువ్వు త్వరగా ఆ బాధలో నుంచి బయటపడాలని ఆశిస్తున్నా. అలాగే ఎప్పుడైనా అతిథిగా వచ్చి నాతో పాటు ఛాంపియన్స్‌ లీగ్‌ చూడొచ్చు’ అని పేర్కొన్నాడు. దానికి మళ్లీ జవాబిచ్చిన యువీ ‘చూద్దాం.. మేం ఎప్పుడూ అంత తేలిగ్గా వదిలిపెట్టం’ అని మాంచెస్టర్‌ యునైటెడ్‌ జట్టును ట్యాగ్‌ చేశాడు. ఇదిలా ఉండగా, వచ్చే నెలలో చెల్సీ జట్టు ఆల్‌ లండన్‌ ఎఫ్‌ఏ కప్‌ ఫైనల్లో ఆర్సినల్‌ జట్టుతో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు