హైదరాబాద్‌కు తొలి ఓటమి 

ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ ఏడో సీజన్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీకి తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం ఆ జట్టు 0-2 తేడాతో ముంబయి సిటీ ఎఫ్‌సీ చేతిలో పరాజయం పాలైంది...

Published : 21 Dec 2020 09:23 IST

వాస్కో: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నీ ఏడో సీజన్‌లో హైదరాబాద్‌ ఎఫ్‌సీకి తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం ఆ జట్టు 0-2 తేడాతో ముంబయి సిటీ ఎఫ్‌సీ చేతిలో పరాజయం పాలైంది. మ్యాచ్‌లో ముంబయి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 38వ నిమిషంలో విఘ్నేశ్‌ గోల్‌ కొట్టి ఆ జట్టు ఖాతా తెరిచాడు. రెండో అర్ధభాగంలో ఆడమ్‌ (59వ నిమిషంలో) గోల్‌తో ముంబయి ఆధిక్యాన్ని పెంచాడు. చివరి వరకూ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్న ఆ జట్టు విజయం దక్కించుకుంది. కేరళ బ్లాస్టర్స్‌ ఎఫ్‌సీ, ఎస్‌సీ ఈస్ట్‌ బెంగాల్‌ జట్ల మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 1-1తో డ్రాగా ముగిసింది. కేరళ ఆటగాడు కోన్‌ (13వ నిమిషంల) సొంత గోల్‌ చేయడంతో ప్రత్యర్థికి ఆధిక్యం లభించింది. ఇంజూరీ సమయంలో జాక్సన్‌ (90+5వ నిమిషంలో) గోల్‌తో కేరళ మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. 

ఇవీ చదవండి..
పెద్ద జట్లు.. చిన్న స్కోర్లు: ఎందుకీ విలవిల?
కిం కర్తవ్యం..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని