క్యాస్ట్రో మరణించిన సరిగ్గా నాలుగేళ్లకు డీగో..!
ఇతడేమో ఫుట్బాల్ దిగ్గజం. అతడేమో రాజకీయ దిగ్గజం. ఇద్దరివీ వేర్వేరు దేశాలు, భిన్న నేపథ్యాలు. కానీ ఒకరంటే మరొకరికి ఎంతో గౌరవం. స్నేహంతో ఒక్కటైన ఆ ఇద్దరు అంతకుమించి...
ఒకే తేదీన స్నేహితుల మరణం
ఇంటర్నెట్డెస్క్: ఒకరేమో ఫుట్బాల్ దిగ్గజం. మరొకరేమో రాజకీయ దిగ్గజం. ఇద్దరివీ వేర్వేరు దేశాలు, భిన్న నేపథ్యాలు. కానీ, ఒకరంటే మరొకరికి ఎంతో గౌరవం. స్నేహంతో ఒక్కటైన ఆ ఇద్దరు అంతకుమించి అనుబంధం ఏర్పర్చుకున్నారు. చివరికి ఒకే రోజు(నవంబర్ 25) ప్రాణాలు విడిచి మరణంలోనూ ఒక్కటయ్యారు. ఆ ఇద్దరే అర్జెంటీనాకు చెందిన ఫుట్బాల్ లెజెండ్ డీగో మారడోనా, క్యూబా మాజీ దేశాధినేత ఫిడెల్ క్యాస్ట్రో. డీగో బుధవారం తుదిశ్వాస విడువగా క్యాస్ట్రో సరిగ్గా నాలుగేళ్ల కిందట ఇదే రోజు కన్నుమూశారు.
స్నేహితులే కాదు అంతకుమించి..
క్యూబా దివంగత నేత ఫిడెల్ క్యాస్ట్రో అంటే డీగోకు అమితమైన గౌరవం. నాలుగేళ్ల కిందట ఆయన మృతిచెందారని తెలిసి ఈ అర్జెంటీనా స్టార్ కంటతడి పెట్టాడు. తన తండ్రి మృతి తర్వాత అంతటి బాధ కలిగించిన సంఘటన ఇదేనని అప్పట్లో పేర్కొన్నాడు. అయితే, డీగో అంతలా భావోద్వేగం చెందడానికి ఓ బలమైన కారణమే ఉంది. అతడాడే రోజుల్లో మత్తు పదార్థాలకు బానిసవ్వగా 1991లో డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. దాంతో 15 నెలల పాటు నిషేధం వేటు పడి ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత కూడా డీగో వాటి జోలికి వెళ్లకుండా ఉండలేకపోయాడు. దీంతో పలుమార్లు అనారోగ్యానికి గురై దాదాపు మృత్యువు అంచుల వరకూ వెళ్లాడు. అలాంటి పరిస్థితుల్లోనే తన చికిత్సకు చేయూతనందించిన ఫిడెల్ క్యాస్ట్రో తండ్రి తర్వాత తండ్రి అంతటివాడని ఆ సందర్భంలో డీగో పేర్కొన్నాడు.
ఆ స్నేహం చిగురించింది అప్పుడే..
డీగో 1986 ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనాను గెలిపించాక తన అభిమాన కమ్యూనిస్ట్ నేత ఫిడెల్ క్యాస్ట్రోను తొలిసారి కలిశాడు. తర్వాత వారిద్దరూ పెద్దగా కలవకపోయినా ఫిడెల్ అంటే అతడికి అభిమానమే. అయితే, 2000ల సంవత్సరం తర్వాత దగ్గరయ్యారు. మత్తుపదార్థాలకు బానిసైన డీగో అనారోగ్యానికి గురవడంతో అర్జెంటీనాలో చికిత్స పొందడానికి అవకాశం లేకపోయింది. అలాంటి విపత్కర సమయంలో క్యూబా అధినేత తన చికిత్సకు సహకరించారని, అలా క్యూబాలో చికిత్స పొందే సమయంలోనే తమ మధ్య స్నేహం పెరిగిందని డీగో అప్పుడు వివరించాడు. ఫిడెల్ తనని ఉదయపు నడకకు ఆహ్వానించేవారని, అప్పుడప్పుడూ తమ మధ్య అనేక విషయాలు చర్చకు వచ్చేవని చెప్పాడు. తామిద్దరం రాజకీయ, క్రీడా అంశాలపై లోతుగా చర్చించేవాళ్లమన్నాడు. అలా తమ స్నేహం బలపడడమే కాకుండా తన ప్రాణాలు కాపాడిన వ్యక్తి క్యాస్ట్రో అని డీగో వెల్లడించాడు.
ఆ అభిమానమే పచ్చబొట్టు వేసుకునేలా చేసింది..
డీగో ఎవర్నైనా ఇష్టపడితే తన ఒంటిమీద వారి టాటూలు వేయించుకునే అలవాటు ఉంది. ఆ కారణంతోనే తన అభిమాన నాయకుడు, తిరుగుబాటు దారుడైన చేగువేరా టాటూను కుడిచేతిపై వేయించుకున్నాడు. అలాగే ఎడమకాలి మీద ఫిడెల్ బొమ్మను వేసుకోవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్