అర్జున్‌ తెందుల్కర్‌కు తప్పని నిరాశ!

దిగ్గజ క్రికెటర్ సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్ తెందుల్కర్‌కు చుక్కెదురైంది. దేశవాళీ టీ20 టోర్నీలో సత్తాచాటి తన కెరీర్‌కు బాటలు వేసుకుందామనకున్న అతడికి నిరాశే మిగిలింది....

Published : 28 Dec 2020 00:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిగ్గజ క్రికెటర్ సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్ తెందుల్కర్‌కు నిరాశే మిగిలింది. దేశవాళీ టీ20 టోర్నీలో సత్తాచాటి తన కెరీర్‌కు బాటలు వేసుకుందామనుకున్న అతడు ముంబయి జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు. సయ్యద్‌ ముస్తాక్ అలీ టోర్నీకి 20 మందితో ప్రకటించిన ముంబయి జట్టులో అతడికి చోటు దక్కలేదు. సూర్యకుమార్‌ యాదవ్ ఆ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.

అయితే ఆల్‌రౌండర్‌ అర్జున్‌ తొలుత ముంబయి జట్టుతో కలిసి ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో పాల్గొన్నాడు. కానీ అతడు సెలక్టర్లను ఆకట్టుకోలేకపోయాడు. నాలుగు వికెట్లు, ఏడు పరుగులు మాత్రమే సాధించాడు. టీమ్‌-బి×టీమ్‌-డి మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌లో సూర్యకుమార్‌ విధ్వంసమే సృష్టించాడు. అర్జున్‌ వేసిన 13వ ఓవర్‌లో బౌండరీలతో చెలరేగి 21 పరుగులు సాధించాడు. కాగా, ముంబయి జట్టులో శివమ్ దూబే, యశస్వీ జైస్వాల్, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధావల్‌ కులకర్ణి ఉన్నారు.

నవరి 10 నుంచి 31 వరకు నిర్వహించనున్న సయ్యద్ ముస్తాక్‌ అలీ టోర్నీ ఆరు రాష్ట్రాల్లో జరుగనుంది. బయోసెక్యూర్‌ వాతావరణంలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. బయోబబుల్‌లో ఆటగాళ్లు జనవరి 2న ప్రవేశిస్తారు. ఈ దేశవాళీ టీ20 టోర్నీలో సత్తాచాటిన ఆటగాళ్లు ఐపీఎల్‌ వేలంలో కీలకంగా మారతారు.

ఇదీ చదవండి

నాయకుడై నడపించాడు

ధోనీ, కోహ్లీనే ఈ దశాబ్దపు సారథులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని