Cricket News:‘నన్ను ఆ కారణంతోనే ఎంపిక చేయలేదా’
జులైలో టీమ్ఇండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ గురువారం జట్టును ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో శిఖర్ ధావన్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ.
(photo:Saurashtra Cricket Twitter)
ఇంటర్నెట్ డెస్క్: జులైలో టీమ్ఇండియా శ్రీలంకలో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ గురువారం జట్టును ప్రకటించింది. సీనియర్ ఆటగాళ్లు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో శిఖర్ ధావన్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. 20మంది ఆటగాళ్లతో పాటు ఐదుగురు నెట్ బౌలర్లను ఎంపిక చేసింది. ఈ బృందంలో చాలా మంది యువ క్రికెటర్లకు అవకాశం దక్కింది. అందులో దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, కృష్ణప్ప గౌతమ్, నితీశ్ రాణా, చేతన్ సకారియా వంటి ఆటగాళ్లు మొదటిసారి టీమ్ఇండియాకు ఎంపికయ్యారు. ఈ పర్యటనలో తనకు కూడా చోటు దక్కుతుందని భావించిన సౌరాష్ట్ర బ్యాట్స్మన్ షెల్డన్ జాక్సన్కు మాత్రం నిరాశే ఎదురైంది. ఈ ఆటగాడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. తాను ఎంపికకాకపోవడంపై జాక్సన్ స్పందించాడు.
‘ఇప్పుడు నాకు 34 ఏళ్లు. అయినప్పటికీ 22-23 ఏళ్ల వారికంటే దూకుడుగా ఆడతాను. ఆటకు వయసు అడ్డుగా కనిపిస్తే నేనేం చేయలేను. లేటు వయసులో జాతీయజట్టులోకి ఎంట్రీ లేదని ఆటకు సంబంధించిన ఏ చట్టాల్లో రాసి ఉంది? మీరు(సెలక్టర్లు) ఏ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేస్తున్నారు. రంజీ స్కోరుతోనా.. ఫిట్నెట్ను ఆధారంగా చేసుకోనా?. వరుసగా మూడు రంజీ సీజన్లలో 800-900 పరుగులు చేశానంటే ఫిట్గా ఉన్నాననే కదా అర్థం. అతని వయసు 30 కంటే ఎక్కువ.. అందుకే ఎంపిక కాలేదు. ఈ పదం చాలా సార్లు విన్నా’ అంటూ జాక్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ‘సూర్యుడు ఉదయిస్తాడు, నేను మళ్లీ ప్రయత్నిస్తా’ అంటూ ట్విటర్లో నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని పోస్టు చేశాడు.
జాక్సన్ 75 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 5634 పరుగులు, 60 లిస్ట్ ఏ మ్యాచ్ల్లో 2096 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు,44 అర్ధసెంచరీలున్నాయి. జాక్సన్ వికెట్కీపర్ కూడా. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 4 మ్యాచ్ల్లో ఆడాడు. ఐపీఎల్ 14 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?