UP Polls: భాజపా ఎన్నికల సాంగ్స్ విడుదల.. బులంద్షహర్లో కాంగ్రెస్కు బిగ్ షాక్!
మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తర్ప్రదేశ్లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేతల రాజకీయ వలసలు ఊపందుకోవడంతో పాటు అభ్యర్థుల ఎంపిక, .......
లఖ్నవూ: మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తర్ప్రదేశ్లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నేతల రాజకీయ వలసలు ఊపందుకోవడంతో పాటు అభ్యర్థుల ఎంపిక, అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలతో యూపీలో రాజకీయం హీటెక్కింది. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న అధికార భాజపా.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు ప్రజల్లోకి మరింతగా దూసుకెళ్లేందుకు శుక్రవారం ఎన్నికల పాటలను విడుదల చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మలతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ కమలదళం ఎన్నికల పాటలను లఖ్నవూలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ విపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గతంలో రాష్ట్ర శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించి గత ప్రభుత్వాల అండతో రెచ్చిపోయిన అల్లరిమూకలు ఇప్పుడు బహిరంగంగా రహదారులపై తమ పోస్టర్లను అతికిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తాము అందరి అభివృద్ధి కోసం పనిచేశాం తప్ప ఏ ఒక్కరికోసమో కాదన్నారు. సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వాల హయాంలో చక్కెరమిల్లులు మూతపడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. తమ ప్రభుత్వమే చెరకు రైతులకు పెండింగ్లో ఉన్న బకాయిలను ఇచ్చిందన్నారు. 2017 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చామని ఈ సందర్భంగా యోగి స్పష్టంచేశారు.
అమిత్ షా ఇంటింటి ప్రచారం రేపు!
మరోవైపు, దేశ రాజకీయాలను శాసించే యూపీలో అధికార పీఠాన్ని కాపాడుకొనేందుకు భాజపా తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం యూపీ పర్యటనకు రానున్నారు. కైరానా నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించడంతో పాటు స్థానిక నేతలతో సమావేశమవుతారు. అలాగే, షామిలి, బాఘ్పట్లలో కూడా భాజపా కార్యకర్తలతో సమావేశం కానున్నట్టు సమాచారం. ఆ తర్వాత మేరఠ్లో ప్రముఖ వ్యక్తులతోనూ అమిత్ షా సమావేశం కానున్నారు.
బులంద్ షహర్లో కాంగ్రెస్కు షాక్!
అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్కు షాక్ తగిలింది. బులంద్షహర్లో ఆ పార్టీకి ఇద్దరు కీలక నేతలు రాజీనామా చేశారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ రాజీనామా చేసినట్టు సమాచారం. బులంద్షహర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు షియోపాల్ సింగ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ వాల్మికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనూప్షహర్ అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేస్తానని షియోపాల్ సింగ్ కోరగా.. అందుకు కాంగ్రెస్ నిరాకరించింది. ఆ స్థానంలో బీఎస్పీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఇటీవల తమ పార్టీలో చేరిన చౌదురి గజేంద్రసింగ్ను బరిలో దించింది. గజేంద్రసింగ్ గత నెలలోనే ఆర్ఎల్డీలో చేరగా.. అక్కడ టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ చేరడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. -
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్కల్యాణ్తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. -
క్యాష్ కొట్టు.. బస్సులు పట్టు
ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది. -
భాజపా లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జుల నియామకం
రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న లోక్సభ స్థానాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జులుగా ఆ పార్టీ నియమించింది. వీరిలో నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. -
డబ్బు తరలించడానికే ఆ కంటెయినర్
అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. -
తొలిదశకు ముగిసిన నామినేషన్లు
లోక్సభ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల గడువు బుధవారం ముగిసింది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?