UP elections: మేం ప్రజలతో పొత్తు పెట్టుకుంటాం: మాయావతి
మరో నాలుగు నెలల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వ్యూహాలు మొదలయ్యాయి.
లఖ్నవూ: మరో నాలుగు నెలల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వ్యూహాలు మొదలయ్యాయి. ఉత్తర్ప్రదేశ్ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బాబాయ్ శివపాల్ యాదవ్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సమాజ్వాదీ పార్టీ అధినేత, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. కాగా.. బహుజన సమాజ్వాది పార్టీ మాత్రం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోదని ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు.
‘మేం ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం.. ఒప్పందాలు కుదుర్చుకోం. సొంతంగానే పోటీ చేస్తాం. మేం అన్ని వర్గాల ప్రజలతో మాత్రమే పొత్తు పెట్టుకుంటాం. ఆ పొత్తే శాశ్వతంగా ఉంటుంది. 2007 ఎన్నికల్లో మాదిరిగానే రాబోయే ఎన్నికల్లో కూడా పూర్తి మెజార్టీ సాధించి అధికారంలోకి వస్తాం’’ అని మాయావతి వెల్లడించారు. అలాగే, సమాజ్వాది, భాజపాలపై మాయావతి విమర్శలు గుప్పించారు. ఎస్పీ, భాజపా మధ్య తేడా ఏమీ లేదని, అవి ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్యాలు అని అన్నారు. ఈ ఎన్నికలను ఆ రెండు పార్టీలు కేవలం హిందూ-ముస్లింలకు సంబంధించినదిగా మార్చాలని ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీని ఉత్తర్ప్రదేశ్ ప్రజలు నమ్మబోరని మాయావతి అన్నారు. ‘‘ఎన్నికల సమయాల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదు. ఆ పార్టీ ఇచ్చిన హామీల్లో 50 శాతం నెరవేర్చినా.. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోయేది కాదు. ఇప్పుడు కాంగ్రెస్ను ప్రజలు నమ్మరు’’ అని మాయావతి ఎద్దేవా చేశారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 403 నియోజకవర్గాలకు గానూ భాజపా 312 చోట్ల విజయం సాధించి అధికారం దక్కించుకుంది. సమాజ్వాది పార్టీ 47 స్థానాల్లో, బహుజన్ సమాజ్వాది 19 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 7 స్థానాలకు పరిమితమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా