రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ భేటీ

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం కానుంది.

Published : 09 Oct 2020 13:44 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన సమావేశం కానుంది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం సవరణల ముసాయిదా బిల్లులను కేబినెట్‌ ఆమోదించే అవకాశముంది. వర్షాకాలం ధాన్యం కొనుగోళ్లు, యాసంగిలో నిర్ణీత విధానంలో పంటలసాగుపై మంత్రివర్గం చర్చించనుంది. ఈనెల 13న ఉదయం 11.30 గంటలకు శాసనసభ, 14న ఉదయం 11 గంటలకు శాసనమండలి ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. చట్ట సవరణకు సంబంధించిన బిల్లులపై చర్చించి ఆమోదించే అవకాశముంది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని