Revanth Reddy: కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా: రేవంత్
ఎంతమంది నాయకులు బయటకు వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. కార్యకర్తలు కష్టపడితేనే దిల్లీలో
హైదరాబాద్: ఎంతమంది నాయకులు బయటకు వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే బలమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. కార్యకర్తలు కష్టపడితేనే దిల్లీలో సోనియమ్మ రాజ్యం వస్తుందని చెప్పారు. కొంపల్లిలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా తరగతుల్లో రేవంత్ మాట్లాడారు. రాష్ట్రాన్ని తెరాస, భాజపా కలిసి దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఆ రెండు పార్టీలు తోడు దొంగలేనన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉండాల్సింది పోయి.. వరి వేస్తే ఉరే అని సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికే ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు రేవంత్ చెప్పారు.
‘‘కాంగ్రెస్లో క్రమశిక్షణ ముఖ్యం. మేం పదవులు అనుభవిస్తున్నామంటే దానికి కారణం కార్యకర్తలే. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటా. సోనియమ్మ రాజ్యం కోసం కష్టపడే వారికి పదవులు, టికెట్లు ఇచ్చే బాధ్యత నేనే తీసుకుంటా. కల్వకుంట్ల కుటుంబం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉంది. కష్టపడే కార్యకర్తలను రాహుల్గాంధీతో సన్మానం చేయిస్తా. కష్టపడని వారిపై జనవరి 26 తర్వాత నేనే చర్యలు తీసుకుంటా. సోనియమ్మ రాజ్యం కోసం రాబోయే 18 నెలలు దీక్షగా పనిచేయాలి’’ అని రేవంత్ కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం