Revanth Reddy: సీబీఐ విచారణ వేయించండి.. కేసీఆర్ అవినీతిని నిరూపిస్తా: రేవంత్
సీఎం కేసీఆర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్మీట్లు కల్లు కాంపౌండ్ను తలపిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి
హైదరాబాద్: సీఎం కేసీఆర్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్మీట్లు కల్లు కాంపౌండ్ను తలపిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విమర్శించారు. కొంపల్లిలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడారు. సంజయ్పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు భాజపా ఎందుకు స్పందించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. భాజపా, తెరాస డ్రామా ఆడుతున్నాయని.. రాష్ట్రంలో కాంగ్రెస్పై చర్చ జరగకుండా ఉండేందుకు ఉమ్మడి వ్యూహం రచిస్తున్నాయని ఆరోపించారు.
‘‘నీళ్లు, నిధుల పేరుతో కేసీఆర్ రూ.వేలకోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఆయన అవినీతిని బయటపెట్టే ధైర్యం మాకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరగాలి. విద్యుత్ ప్రాజెక్టుల్లోనే కేసీఆర్ రూ.వెయ్యికోట్ల అవినీతి చేశారు. మంత్రులు ఇసుక మాఫియా చేస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సవాల్ విసురుతున్నా.. సీబీఐ విచారణ వేయించండి. కేసీఆర్ అవినీతిని నేను నిరూపిస్తా. అలా నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని రేవంత్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా