Ts News: కమీషన్లు అడగడం లేదు.. గిట్టుబాటు ధర కల్పించండి: రేవంత్రెడ్డి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేఏసీ (జాయింట్ యాక్టింగ్ కమిటీ)గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మండిపడ్డారు. తెరాస, భాజపా కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. రూ. 3 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న ప్రభుత్వాన్ని
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేఏసీ (జాయింట్ యాక్టింగ్ కమిటీ)గా ఏర్పడి రైతులను మోసం చేస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మండిపడ్డారు. తెరాస, భాజపా కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. రూ. 3 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న ప్రభుత్వాన్ని కమీషన్లు అడగటం లేదని.. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు.
‘‘ఇందిరా పార్క్ వద్ద సీఎం కేసీఆర్ రైతుల పక్షాన మాట్లాడుతారో, లేదో అని చూశాం. అక్కడ ఏర్పాట్లు చూసి అవాక్కయ్యాం. ఎవరైనా ఏసీలు పెట్టుకొని ధర్నాలు, దీక్షలు చేస్తారా? రైతుల పక్షాన పోరాటం చేయాలంటే సీఎం కేసీఆర్ స్వయంగా అన్నదాతల వద్దకు వెళ్ళాలి. లేదంటే చనిపోయిన రైతు కుటుంబాలను పరామర్శించాలి. బండి సంజయ్, కిషన్ రెడ్డి.. దిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని నిలదీయాలి. భాజపా, తెరాస కార్యకర్తలు ఒకరినొకరు కొట్టుకున్నట్లు చేస్తూ మధ్యలో రైతులను చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ధాన్యం సేకరణపై కార్యాచరణ ఏంటో సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలి’’ అని రేవంత్ పేర్కొన్నారు.
23 వరకు సీఎం కేసీఆర్కు సమయం..
రేపటి నుంచి 23 వరకు కల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యమం ఉంటుందని రేవంత్రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ నెల 23 వరకు సీఎం కేసీఆర్కు సమయం ఇస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత రైతులతో కలిసి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రతి గింజ కొనే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని రేవంత్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..