AP News: తప్పు చేశామని గ్రహించే స్థాయిలో అధికార పక్షం లేదు : యనమల
అసభ్య పదజాలంతో దూషణల పర్వంగా ఏపీ అసెంబ్లీ మారిందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.
అమరావతి: అసభ్య పదజాలంతో దూషణల పర్వంగా ఏపీ అసెంబ్లీ మారిందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. సభను అవమానిస్తూ ఆనందించే ధోరణి అధికార పార్టీలో ఉందని ఆయన ఆరోపించారు. నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలో యనమల స్పందించారు. సభలో లేని వాళ్లపై మాట్లాడకూడదనే మర్యాద విస్మరించారని ధ్వజమెత్తారు. నియంత్రించే పరిణామాలు లేనప్పుడు బహిష్కరించక ఏం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత విమర్శలకు తావిస్తున్నప్పుడు ప్రజల తరఫున ప్రజల్లోకే వెళ్తామని యనమల అన్నారు. తప్పు చేశామని గ్రహించే స్థాయిలో అధికారపక్షం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!