AP News: గవర్నర్‌కు.. అప్పులకు సంబంధమేంటో బుగ్గన చెప్పాలి: గోరంట్ల

ఆంధ్రప్రదేశ్‌ అప్పులమయం కావడంతో చీకట్లు కమ్ముకొస్తున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 03 Nov 2021 13:56 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అప్పులమయం కావడంతో చీకట్లు కమ్ముకొస్తున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ పేరుతో అప్పులు తెచ్చి ఆయననూ ఊబిలోకి నెట్టారన్నారు. గవర్నర్‌కు.. అప్పులకు ఏం సంబంధమో ఆర్థిక మంత్రి బుగ్గన సమాధానం చెప్పాలని గోరంట్ల డిమాండ్‌ చేశారు. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్‌.. అధికారులను పిలిచి మందలించే పరిస్థితి వచ్చిందన్నారు.

ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు ఏదో ధర్మం చేస్తున్నట్లుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల మాట్లాడుతున్నారని తెలిపారు. రూ.కోట్లలో అప్పులు తెస్తూ సకాలంలో జీతాలు ఎందుకు చెల్లించలేకపోతున్నారని గోరంట్ల ప్రభుత్వాన్ని నిలదీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని