TS News: నాలుగు ప్రధాన ప్రజా సమస్యలపై కాంగ్రెస్ కార్యాచరణ: రేవంత్రెడ్డి
ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లే కామారెడ్డిలో ధాన్యం రాశిపై గుండెపగిలి రైతు చనిపోయాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులతో..
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్లే కామారెడ్డిలో ధాన్యం రాశిపై గుండెపగిలి రైతు చనిపోయాడని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులతో గాంధీ భవన్లో అత్యవసరంగా సమావేశమైన రేవంత్రెడ్డి .. నాలుగు ప్రధాన ప్రజాసమస్యలపై సమీక్ష చేసి భవిష్యత్ కార్యాచరణ తీసుకున్నట్టు వెల్లడించారు. వరి వేస్తే ఉరి తీస్తామంటూ కేసీఆర్ రైతులపై ప్రతాపం చూపుతున్నారని ధ్వజమెత్తారు. పార్టీకి చెందిన నాలుగు బృందాలు వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తాయని తెలిపారు. పెట్రోల్, డీజిల్పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా పన్నులు వేసి దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై జంగ్ సైరన్ మోగించామని, పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని దళితబంధు తెచ్చిన సీఎం కేసీఆర్ ఉప ఎన్నిక తర్వాత 4వ తేదీ నుంచి దళితబంధు అమలు చేస్తామని ఇప్పటి వరకూ ఆ ఊసే ఎత్తలేదని ధ్వజమెత్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే