AP 3 Capitals: మండలిలో మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లు.. ప్రవేశపెట్టిన బుగ్గన

మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టారు.

Updated : 23 Nov 2021 10:32 IST

అమరావతి: మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకున్నట్లు సోమవారం శాసనసభలో ఆయన బిల్లు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ బిల్లు ఆమోదానికి ఇవాళ మండలిలోనూ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ వికేంద్రీకరణ రాష్ట్రానికి అవసరమని.. ఈ నిర్ణయం తీసుకోకపోతే ఎప్పటికైనా వేర్పాటువాదం వచ్చే ప్రమాదముందన్నారు. శివరామకృష్ణన్‌ కమిటీ కూడా ఇదే అబిప్రాయాన్ని వ్యక్తం చేసిందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని