Manish Tewari Book: భాజపా స్పందన చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది..!
జాతీయ భద్రతపై వారి (భాజపా) వ్యవహరించిన తీరుపై చేసిన కఠిన విశ్లేషణపైనా ఇదే విధంగా స్పందిస్తారా? అంటూ ట్విటర్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ
దిల్లీ: ముంబయి పేలుళ్ల సమయంలో యూపీఏ ప్రభుత్వం దీటుగా స్పందించలేదంటూ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ తాను రాసిన పుస్తకంలో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, దీనిపై భాజపా నుంచి వచ్చిన స్పందనను చూసి మనీష్ తివారీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జాతీయ భద్రతపై తాను రాసిన 304పేజీల పుస్తకంలో కేవలం ఒక్క అంశాన్ని పట్టుకొని భాజపా విమర్శలు చేస్తోందన్నారు. అదే సమయంలో జాతీయ భద్రతపై వారి (భాజపా) వ్యవహరించిన తీరుపై చేసిన కఠిన విశ్లేషణపైనా ఇదే విధంగా స్పందిస్తారా? అంటూ ట్విటర్లో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
గడిచిన రెండు దశాబ్దాల్లో భారత జాతీయ భద్రతకు ఎదురైన సవాళ్లపై ‘10 ఫ్లాష్ పాయింట్స్: 20 ఇయర్స్ - నేషనల్ సెక్యూరిటీ సిచ్యువేషన్స్ దట్ ఇంపాక్టెడ్ ఇండియా’ అనే పేరుతో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ఓ పుస్తకాన్ని రాశారు. 304 పేజీలున్న ఈ పుస్తకం డిసెంబర్ 1న విడుదల కానుంది. అందులో కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ తాజాగా మనీష్ తివారీ ట్విటర్లో షేర్ చేశారు. వందలాది మంది అమాయకులను అత్యంత క్రూరంగా హతమార్చిన సందర్భంలో సహనంతో ఉండడమనేది బలానికి సంకేతం కాదని.. అది కచ్చితంగా బలహీనతకు సంకేతమేనంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వ ప్రతిస్పందనను పరోక్షంగా విమర్శించారు.
ఈ విషయాన్నే అస్త్రంగా మలచుకొన్న భాజపా నాయకులు.. జాతీయ భద్రత విషయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం సరిగా వ్యవహరించలేదంటూ విమర్శలు మొదలుపెట్టారు. ఇదే అంశంపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో సహా పలువురు భాజపా నేతలు కాంగ్రెస్పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ నేత రాసిన పుస్తకంలోని అంశాలను చూస్తుంటే అప్పటి యూపీఏ ప్రభుత్వానిది ఎంత అసమర్థ, బలహీన పాలనో స్పష్టమవుతోందంటూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలా భాజపా నాయకుల విమర్శలపై స్పందించిన మనీష్ తివారీ.. జాతీయ భద్రత విషయంలో వారి (భాజపా) ప్రభుత్వంపై చేసిన కఠిన విశ్లేషణపైనా ఇలాగే స్పందిస్తారా? అంటూ ట్విటర్లో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM