TS News: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరు.. కారుకు 6 స్థానాలు ఏకగ్రీవం, మరో ఆరింటిలో పోటీ
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది. ఎమ్మెల్సీ పోరులో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తెరాస అభ్యర్థిగా దండెం విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా పుష్పరాణి..
ఇంటర్నెట్ డెస్క్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగిసింది. ఎమ్మెల్సీ పోరులో ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరో ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి తెరాస అభ్యర్థిగా దండెం విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా పుష్పరాణి బరిలో నిలిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చివరకు తెరాసకు చెందిన భాను ప్రసాదరావు, ఎల్ రమణతో పాటు మరో 8మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ పోటీ చేస్తున్నారు. మెదక్ జిల్లాలో తెరాస అభ్యర్థిగా యాదవరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్మల, స్వతంత్ర అభ్యర్థిగా మల్లారెడ్డి పోటీలో ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి తెరాస తరఫున తాతా మధు, కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు సహా మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తెరాస నుంచి కోటిరెడ్డితో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీపడనున్నారు.
ఆరు స్థానాల్లో తెరాస ఏకగ్రీవం
రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్రెడ్డి, శంభీపూర్ రాజు, వరంగల్ స్థానం నుంచి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి కల్వకుంట్ల కవిత, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచికుళ్ల దామోదర్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఆరుగురు తెరాస అభ్యర్థులకు ఎన్నికల అధికారులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు