Ts News: మీకు చేతకాకపోతే రాజీనామా చేయండి.. కేంద్రంతో మేం పోరాడుతాం: కోమటిరెడ్డి
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కలిసి రైతులను మోసం చేస్తున్నాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. దిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా?అని సవాల్ విసిరారు. కేంద్రం పేరు చెప్పి వడ్లు కొననని సీఎం చెప్పడం దారుణమన్నారు. కేంద్రం కొనకపోతే...
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం కలిసి రైతులను మోసం చేస్తున్నాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. దిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా?అని సవాల్ విసిరారు. కేంద్రం పేరు చెప్పి వడ్లు కొననని సీఎం చెప్పడం దారుణమన్నారు. కేంద్రం కొనకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం రూ.20వేల కోట్లు కేటాయించలేరా? అని నిలదీశారు.
‘‘తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి వచ్చాను అని చేప్పుకుంటారు కదా.. మరి కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదు? తెలంగాణ అంటేనే పోరాటం.. మనం చేతులెత్తేయొద్దు. ఉత్తరాది రైతులు చేసిన విధంగా పోరాటం చేద్దాం. మూసీ పరివాహకం, సాగర్ ప్రాంతాలలో వరి తప్ప ఇంకేం పంటలు పండవు. మరి వారి పరిస్థితి ఏంటి..?మీ ఇష్టానికి కొనం అని ప్రకటనలు చేస్తే రైతుల పరిస్థితి ఏం కావాలి? మీ ప్రకటనలతో రైతులు రోడ్లపైన పడతారు. ఎట్టి పరిస్థితుల్లో వడ్లు కొనాల్సిందే. రాష్ట్రంలో 50 శాతం భూముల్లో వరి తప్ప ఇంకేం పండవు అని మీకు తెలుసు. తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితి ఏంటి? రైతులు రోడ్లపైన పడే పరిస్థితి కనిపిస్తుంటే.. రైతులు పక్క రాష్ట్రాల్లో భూములు కొంటున్నారని సీఎం అంటున్నారు. రైతుల సమస్యలపై కేసీఆర్కి కనీస అవగాహన లేదు. కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని వడ్లు కొనకుంటే ఊరుకునేది లేదు. సీఎం కేసీఆర్.. మీకు చేతకాకపోతే రాజీనామా చేయండి. కేంద్రంతో మేం పోరాటం చేస్తాం’’ అని కోమటిరెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!