Revanth Reddy: కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటే రూ.2లక్షల బీమా: రేవంత్
రాష్ట్రంలో 30లక్షలకు పైగా కాంగ్రెస్ సభ్యత్వాలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని.. అన్ని వర్గాల రక్షణకు పోరాడుతున్న
హైదరాబాద్: రాష్ట్రంలో 30లక్షలకు పైగా కాంగ్రెస్ సభ్యత్వాలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయమని.. అన్ని వర్గాల రక్షణకు పోరాడుతున్న అగ్రనేత రాహుల్గాంధీకి మద్దతుగా నిలవాలని కోరారు. గాంధీభవన్లో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రారంభం సందర్భంగా రేవంత్ మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రూ.2లక్షల బీమా సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. ఈనెల 9, 10 తేదీల్లో జిల్లా, మండల అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామని.. 14 నుంచి 21 వరకు గ్రామాల్లో ‘కాంగ్రెస్ జన జాగరణ’ యాత్రలు చేపట్టాలని రేవంత్ పిలుపునిచ్చారు. డిసెంబర్ 9న పరేడ్ గ్రౌండ్స్లో రాహుల్గాంధీతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ సభ్యత్వం అంటే ఒక గౌరవమన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి దేశాభివృద్ధికి పాటుపడుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వీహెచ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్