Chandrababu: శాసనసభలో చంద్రబాబు భావోద్వేగం

తెదేపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు శాసనసభలో భావోద్వేగానికి గురయ్యారు.

Updated : 19 Nov 2021 13:18 IST

అమరావతి: తెదేపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు శాసనసభలో ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. సభలో తన సతీమణి గురించి వ్యక్తిగత ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట్లాడుతుండగానే స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆయన మైక్‌ను కట్‌ చేశారు. 

ఈరోజు సభలో చంద్రబాబుపై వైకాపా సభ్యులు పలు ఆరోపణలు చేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ ‘‘8వసారి ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టాను. 1978 నుంచి హేమాహేమీలతో పనిచేశాను. ఎన్నో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నాం. కానీ గత రెండున్నరేళ్లలో  ఎన్నో అవమానాలు పడ్డాం. కుప్పం ఎన్నిక ఫలితం తర్వాత తనను చూడాలని సీఎం జగన్‌ వ్యాఖ్యానించినా దాన్ని నేను వ్యక్తిగతంగా తీసుకోలేదు. ఈరోజు సభలో నా సతీమణి గురించి కూడా ఆరోపణలు చేశారు’’ అని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.

ఈ క్రమంలో ఆయన మైక్‌ను స్పీకర్‌ తమ్మినేని సీతారాం కట్‌ చేశారు. దీంతో కలత చెందిన చంద్రబాబు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. సభలో జరిగిన పరిణామాలపై కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని