Ts News: సీఎం కేసీఆర్ మొండి వైఖరితో రైతులకు నష్టం: కిషన్రెడ్డి
సీఎం కేసీఆర్ మొండి వైఖరి వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు
హైదరాబాద్: సీఎం కేసీఆర్ మొండి వైఖరి వల్ల రాష్ట్రంలోని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. దిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం అందడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వాలు మే నెలలో పంటల ప్రణాళిక విడుదల చేశాయన్నారు. ఒకసారి పత్తి వద్దన్నారు.. మరోసారి వరి వద్దన్నారు.. వ్యవసాయంపై సీఎం కేసీఆర్కు స్థిరమైన అభిప్రాయం, అవగాహన లేదని విమర్శించారు. హుజూరాబాద్ ఓటమి తర్వాత కేసీఆర్కు నిద్రపట్టని పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.
‘‘ధాన్యం విషయంలో లేని సమస్యను పట్టుకొని సీఎం కేసీఆర్ ఆందోళన చేస్తున్నారు. బాయిల్డ్ రైస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా హెచ్చరిస్తూనే ఉంది. ధాన్యం కొనేదిలేదని కేంద్రం ఎప్పుడు, ఎలా చెప్పిందో నిరూపించాలి. మేము బాయిల్డ్ రైస్ ఇవ్వము అని రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి రాసి ఇచ్చింది. కొత్త వంగడాలు ఇచ్చి రైతులను రా రైస్ దిశగా రాష్ట్ర ప్రభుత్వం మళ్లించాలి. పుత్రవాత్సల్యం కోసం రైతులకు ఆగం చేయొద్దు. భాజపాపై వ్యతిరేకత పెంచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. చివరి బస్తా వరకు కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది’’ అని కిషన్రెడ్డి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ