Ts News: తెలంగాణ రైతులకు సమస్యగా మారిన భాజపా నేతలు: నిరంజన్రెడ్డి
తెలంగాణ రైతులకు భాజపా నేతలు సమస్యగా మారారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వద్దకు భాజపా నేతలు వెళ్లాల్సిన
హైదరాబాద్: తెలంగాణ రైతులకు భాజపా నేతలు సమస్యగా మారారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల వద్దకు భాజపా నేతలు వెళ్లాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. గతంలో కన్నా ఇప్పుడు ఎక్కువ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు. యాసంగిలో వడ్లు కొనుగోలు చేయాలని అడుగుతుంటే భాజపా నేతలు మాట్లాడడం లేదని ఆక్షేపించారు. ప్రశాంతంగా ఉన్న రైతాంగాన్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా నేతలకు చిత్తశుద్ధి ఉంటే దిల్లీ వెళ్లి యాసంగి వడ్ల కొనుగోలుపై లిఖితపూర్వక ప్రకటన తీసుకురావాలని డిమాండ్ చేశారు. రైతులకు అగ్రహం తెప్పించవద్దని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి వివరించారు. ఎవరు దాడులు చేస్తున్నారో చట్టపరంగా తేలుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)