Praja Sangrama Yatra: కేసీఆర్‌ను జైలుకు పంపించే పార్టీ భాజపానే: బండి సంజయ్‌

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. బండి సంజయ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది..

Updated : 24 Sep 2022 16:14 IST

హైదరాబాద్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. బండి సంజయ్‌ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. పాదయాత్రలో భాగంగా ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న బండి సంజయ్‌ చేవెళ్లలో మాట్లాడారు. తెలంగాణలో ప్రధాని ఆవాస్‌ యోజన కింద 70 వేల ఇళ్లు ఇచ్చారన్నారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద మరుగుదొడ్ల నిర్మాణం, గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద రేషన్‌ బియ్యం, కంపా పథకం కింద హరితహారం కార్యక్రమానికి నిధులు ఇచ్చినట్లు చెప్పారు. కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు, వీధిలైట్లు, నీళ్లు, మురుగునీటి కాలువలకు నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఏనాటికైనా సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపించే పార్టీ భాజపానే అని బండి సంజయ్‌ స్పష్టం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని