AP 3 Capitals: ఇది ఇంటర్వెల్‌ మాత్రమే.. : ఏపీ మంత్రి పెద్దిరెడ్డి

మూడు రాజధానుల నిర్ణయాన్ని కేబినెట్‌ ఉపసంహరించుకోవడంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.

Updated : 22 Nov 2021 14:26 IST

తిరుపతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని కేబినెట్‌ ఉపసంహరించుకోవడంపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు.  బిల్లుల ఉపసంహరణ ఇంటర్వెల్‌ మాత్రమేనని.. శుభం కార్డుకు మరింత సమయం ఉందని చెప్పారు. తిరుపతిలోని రాయలవారి చెరువు వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. 

‘‘సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశాం. నేను ఇప్పటికీ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నాను. బిల్లుల ఉపసంహరణ అమరావతి రైతుల విజయమేమీ కాదు. అమరావతి రైతుల పాదయాత్ర లక్షల మందితో సాగుతోందా? అది పెయిడ్‌ ఆర్టిస్టుల పాదయాత్ర. రైతుల పాదయాత్ర చూసి బిల్లులు ఉపసంహరించుకోలేదు’’ అని పెద్దిరెడ్డి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని