AP News: చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడలేదు: అంబటి

తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి శాసనసభలో ఎవరూ మాట్లాడలేదని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. శుక్రవారం ఆయన

Published : 20 Nov 2021 01:10 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి శాసనసభలో ఎవరూ మాట్లాడలేదని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో ఓడిపోవడం వల్లే చంద్రబాబు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. శాసనసభ ఒక్క రోజే నిర్వహించాలని అనుకున్నా... ప్రతిపక్ష పార్టీ అభ్యర్థన మేరకు 26వరకు పొడిగించారని తెలిపారు. ‘‘ మళ్లీ సీఎంగానే శాసనసభకు వస్తానని చంద్రబాబు శపథం చేసి సభ నుంచి వెళ్లిపోయారు. సభ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఏదేదో మాట్లాడారు. సీఎం జగన్‌ను అసభ్య పదజాలంతో తిట్టించినా ఆయన ప్రజలకే చెప్పుకున్నారు.. కానీ, ఇలా చేయలేదు. పార్టీని విడిచి పెట్టి వెళ్లాల్సిన పరిస్థితులు చంద్రబాబుకు వచ్చేశాయి. మీడియా సమావేశంలో ఆయన విలపించటం డ్రామా మాత్రమే. వైసీపీపై బురదచల్లి విలపిస్తూ సానుభూతి పొందాలని  చంద్రబాబు చూస్తున్నారు’’ అని అంబటి రాంబాబు ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని