AP News: చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడలేదు: అంబటి
తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి శాసనసభలో ఎవరూ మాట్లాడలేదని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. శుక్రవారం ఆయన
అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి శాసనసభలో ఎవరూ మాట్లాడలేదని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో ఓడిపోవడం వల్లే చంద్రబాబు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. శాసనసభ ఒక్క రోజే నిర్వహించాలని అనుకున్నా... ప్రతిపక్ష పార్టీ అభ్యర్థన మేరకు 26వరకు పొడిగించారని తెలిపారు. ‘‘ మళ్లీ సీఎంగానే శాసనసభకు వస్తానని చంద్రబాబు శపథం చేసి సభ నుంచి వెళ్లిపోయారు. సభ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఏదేదో మాట్లాడారు. సీఎం జగన్ను అసభ్య పదజాలంతో తిట్టించినా ఆయన ప్రజలకే చెప్పుకున్నారు.. కానీ, ఇలా చేయలేదు. పార్టీని విడిచి పెట్టి వెళ్లాల్సిన పరిస్థితులు చంద్రబాబుకు వచ్చేశాయి. మీడియా సమావేశంలో ఆయన విలపించటం డ్రామా మాత్రమే. వైసీపీపై బురదచల్లి విలపిస్తూ సానుభూతి పొందాలని చంద్రబాబు చూస్తున్నారు’’ అని అంబటి రాంబాబు ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.