AP News: ఏపీ మంత్రి నుంచి ఆ శాఖ తొలగింపు.. 

ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా ఉన్న నారాయణస్వామి నుంచి వాణిజ్య పన్నుల శాఖను ప్రభుత్వం తొలగించింది. ఆయన్ను ఎక్సైజ్‌ శాఖకే పరిమితం

Updated : 31 Oct 2021 11:34 IST

 బుగ్గనకు అదనంగా కేటాయింపు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా ఉన్న నారాయణస్వామి నుంచి వాణిజ్య పన్నుల శాఖను ప్రభుత్వం తొలగించింది. ఆయన్ను ఎక్సైజ్‌ శాఖకే పరిమితం చేసింది. కొత్తగా వాణిజ్య పన్నుల శాఖను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి కేటాయించింది. ఆర్థిక, ప్రణాళిక, శాసనసభా వ్యవహారాలను ఇప్పటివరకు బుగ్గన చూస్తుండగా ఇకపై వాణిజ్య పన్నులశాఖ బాధ్యతలూ ఆయనే పర్యవేక్షిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు