TS Politics: కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు గోరీ కట్టడం ఖాయం : ఈటల
రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గోరీ కట్టడం ఖాయమని, రాష్ట్రంలో భాజపా జెండా
చౌటుప్పల్ : రానున్న ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గోరీ కట్టడం ఖాయమని, రాష్ట్రంలో భాజపా జెండా ఎగరబోతోందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. లింగోజీగూడెంలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం చౌటుప్పల్లోని భాజపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ అహంకారం, ఆధిపత్య ధోరణి, రాచరిక పోకడలు తెలంగాణ గడ్డ మీద చెల్లవని హుజూరాబాద్ ఎన్నికల్లో రుజువైందని ఈటల చెప్పారు. ఓడించారనే అక్కసుతోనే ధాన్యం కొనకుండా రైతులను వేధింపులకు గురిచేస్తున్నాడని దుయ్యబట్టారు. రైతులు పండించిన పంటను కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది కాదా? అని ఈ సందర్భంగా సీఎంను ఈటల ప్రశ్నించారు. కేసీఆర్ అసమర్థ సీఎం అని పలు జాతీయ సర్వేలు చెబుతున్నాయని విమర్శించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సందర్భం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాతపెట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు, ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్, నాయకులు గూడల బిక్షంగౌడ్, వెంకటేశం గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్