‘సమాజ్వాదీ అత్తర్’తో సోషలిజం పరిమళిస్తుందట!..
ఉత్తర్ప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలకు ఆయా పార్టీలు ఇప్పటినుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి! హామీలు ప్రకటిస్తూ, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజలతో మమేకమవుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. ఓటర్లను...
పెర్ఫ్యూమ్లను విడుదల చేసిన అఖిలేశ్
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలకు ఆయా పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి. హామీలు ప్రకటిస్తూ, వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజలతో మమేకమవుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. ఓటర్లను ఆకట్టుకునే దిశగా విభిన్న ప్రయత్నం చేశారు. ‘సమాజ్వాదీ అత్తర్’ పేరిట తయారు చేసిన పెర్ఫ్యూమ్లను మంగళవారం విడుదల చేశారు. 2022 ఎన్నికల్లో ఈ సెంట్ తన అద్భుతాన్ని చూపిస్తుందన్నారు. దీన్ని దాదాపు 22 రకాల సహజ పరిమళాలతో తయారు చేశారట. ఆగ్రా, లఖ్నవూ, వారణాసి, కన్నౌజ్ నగరాల అత్తరు సంస్కృతిని ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు.
కన్నౌజ్కు చెందిన పార్టీ నేత, యూపీ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలు ఈ పెర్ఫ్యూమ్ను ఉపయోగించినప్పుడు.. ‘సోషలిజం’ పరిమళం రావడాన్ని గుర్తిస్తారని పేర్కొన్నారు. ఈ సెంట్ 2022లో ద్వేషాన్ని అంతం చేస్తుందని వివరించారు. పెర్ఫ్యూమ్ డబ్బాపై అఖిలేష్ యాదవ్ ఫొటో, పార్టీ ఎన్నికల గుర్తు ఉంది. ఎస్పీ ఈ తరహా ఉత్పత్తులను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2016లోనూ అఖిలేష్ యాదవ్ రాష్ట్రంలో తన ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా 'సమాజ్వాదీ సుగంధ్' పేరిట అనేక రకాల పెర్ఫ్యూమ్లను విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ