Sanjay Raut: రాష్ట్రపతిని రాజీనామా చేయమని అడుగుతారా?: సంజయ్ రౌత్
మహారాష్ట్రలో మైసూరు మహారాజు టిప్పు సుల్తాన్ పేరు రాజకీయ వివాదాలకు దారితీస్తోంది. తాజాగా ముంబయిలో ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని గార్డెన్కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడంపై భాజపా, విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందువులను టిప్పు సుల్తాన్ హింసించినట్లు
భాజపాను ప్రశ్నించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్
ముంబయి: మహారాష్ట్రలో మైసూరు మహారాజు టిప్పు సుల్తాన్ పేరు రాజకీయ వివాదాలకు దారితీస్తోంది. తాజాగా ముంబయిలో ఓ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని గార్డెన్కు టిప్పు సుల్తాన్ పేరు పెట్టడంపై భాజపా, విశ్వ హిందూ పరిషత్(వీహెచ్పీ) ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందువులను టిప్పు సుల్తాన్ హింసించినట్లు చరిత్ర చెబుతోందని, అలాంటి వ్యక్తులకు గౌరవం ఇవ్వడాన్ని భాజపా ఒప్పుకోదని ఆ పార్టీ నేత దేవేంద్ర ఫడణవీస్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా భాజపా, వీహెచ్పీ నేతలు నిరసన చేపట్టారు. కాగా.. భాజపా తీరుపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. టిప్పు సుల్తాన్ గురించి తమకు తెలుసని.. భాజపా నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రపతి కూడా టిప్పు సుల్తాన్ను కొనియాడారని, ఆయన్ను రాజీనామా చేయమని డిమాండ్ చేయగలరా అని భాజపా నేతల్ని ప్రశ్నించారు.
‘‘తమకు మాత్రమే చరిత్ర తెలుసని భాజపా భావిస్తోంది. ప్రతి ఒక్కరూ చరిత్రను సృష్టించాలనుకుంటారు. కానీ, ఈ చరిత్రకారులు(భాజపా నేతలను ఉద్దేశించి) చరిత్రను మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మాకు టిప్పు సుల్తాన్ గురించి బాగా తెలుసు. భాజపా నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యముంది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కర్ణాటకలో పర్యటించినప్పుడు టిప్పు సుల్తాన్.. చారిత్రక వీరుడని, స్వాతంత్ర్య సమరయోధుడని కొనియాడారు. మరి రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతి పదవికి రాజీనామా చేయమని భాజపా నేతలు అడుగుతారా?’’అని ప్రశ్నించారు. ఈ విషయంలో భాజపా అనవసరంగా రాద్ధాంతం చేస్తోందని సంజయ్ రౌత్ మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ