Rahul Gandhi: సమాచారం లేదని పరిహారం ఇవ్వరా? ఇదిగో ఆ జాబితా: రాహుల్
సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో మృతిచెందిన రైతుల సమాచారం తమ వద్ద లేదంటూ ఇటీవల లోక్సభలో కేంద్రం ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు.....
దిల్లీ: సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో మృతిచెందిన రైతుల సమాచారం తమ వద్ద లేదంటూ ఇటీవల లోక్సభలో కేంద్రం ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. నెలల తరబడి కొనసాగిన ఈ పోరాటంలో దాదాపు 700 మందికిపైగా రైతులు చనిపోయారన్నారు. సమాచారం లేదని చెప్పి ఆ రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడం మానేస్తారా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. పరిహారం ఇవ్వడం ఇష్టంలేకే కేంద్రం అబద్ధాలాడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. శుక్రవారం సాయంత్రం ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోరాటంలో అమరులైన అన్నదాతల జాబితా పంజాబ్ ప్రభుత్వం వద్ద ఉందని.. దాన్ని కేంద్రం తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్లే 700 మంది రైతులు చనిపోయారని, ఆ కుటుంబాలను ఆదుకొనే బాధ్యత కేంద్రానిదేనన్నారు.
ఒక్క పంజాబ్ ప్రభుత్వమే 403 మంది రైతుల్ని గుర్తించిందని రాహుల్ తెలిపారు. పంజాబ్ కాకుండా మిగతా ప్రాంతాలకు చెందిన 100మంది రైతుల జాబితా తమ పార్టీ వద్ద ఉందనీ.. మరో 200 మంది జాబితా పబ్లిక్ రికార్డ్స్లో ఉన్నట్టు వివరించారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయడానికి మించి రైతుల డిమాండ్లను మోదీ సర్కార్ అంగీకరిస్తుందని తాను అనుకోవడంలేదనీ.. కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదన్నారు. రైతుల ఆందోళనలకు పంజాబ్ ప్రభుత్వం బాధ్యత లేకపోయినప్పటికీ ఈ పోరాటంలో మృతిచెందిన 403 మంది కర్షకుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున పరిహారం అందించిందన్నారు. అలాగే, 152 మంది రైతుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చిందని, మిగతా వారికి కొలువులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. ఈ వివరాలన్నీ ప్రజా బాహుళ్యంలోనే ఉన్నట్టు తెలిపారు. తమ వద్ద ఉన్న జాబితాను సోమవారం పార్లమెంట్ సెషన్లో పెట్టనున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద వివరాలు లేకపోయినా.. ‘ఇదిగో మా వద్ద పేర్లు, నంబర్లు, అడ్రస్లు ఉన్నాయి’ అని రాహుల్ వ్యాఖ్యానించారు. సాగుచట్టాల విషయంలో ప్రధాని తప్పును అంగీకరించి బహిరంగ క్షమాపణలు కోరినా.. పోరాటంలో మరణించిన రైతులకు పరిహారం ఇవ్వడానికి సమస్యేంటి అని రాహుల్ ప్రశ్నించారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?