మేం లేకుండా 2023లో ఎవరూ ఏంచేయలేరు: కుమారస్వామి
కర్ణాటకలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కీలక భూమిక పోషిస్తుందని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తమ పార్టీ లేకుండా రాష్ట్రంలో......
బెంగళూరు: కర్ణాటకలో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ కీలక భూమిక పోషిస్తుందని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. తమ పార్టీ లేకుండా రాష్ట్రంలో ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు పార్టీ ఫిరాయింపులు అన్ని పార్టీల్లోనూ సర్వసాధారణ విషయమైపోయిందన్నారు. జేడీఎస్ బలోపేతమవుతోందనీ.. అంతేకాకుండా 2023 ఎన్నికల తర్వాత తమ పార్టీ లేకుండా ఎవరూ ఏమీ చేయలేరన్నారు. తమ పార్టీని కాపాడుతూ, దాన్ని పెంచి పోషించే ఓ వర్గం ఉందనీ.. వారెప్పటికీ పార్టీని వీడిపోయేవారు కాదనే అహంతో తానిలా మాట్లాడటంలేదన్నారు. తమ పార్టీ కార్యకర్తల వల్లే జేడీఎస్ ఇలా ఉంది తప్ప నేతల వల్ల కాదన్నారు. ఎలాంటి నేతలూ లేకుండానే పలు ఎన్నికల్లో సీట్లు గెలుచుకున్నామన్నారు. గతంలో సిద్ధరామయ్య జేడీఎస్లో ఉన్నప్పుడు 19శాతం ఓట్లు సాధించామనీ.. ఆయన బయటకు వెళ్లాక కూడా అలాగే ఉందన్నారు. ఇది కార్యకర్తల వల్లే తప్ప తనవల్ల అని చెప్పుకోవడంలేదన్నారు. మరోవైపు, కుమారస్వామి ఇప్పటికే ‘మిషన్ 123’ ప్రకటించారు. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లకు గాను కనీసం 123 సీట్లు గెలుచుకొని స్వతంత్రంగా అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని ఇటీవల వ్యాఖ్యానించని విషయం తెలిసిందే.
2018లో కర్ణాటకలో ఏ ఒక్కపార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పుడు కుమారస్వామి సీఎంగా ఉన్నారు. అయితే, 2019లో సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలతో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి భాజపాలో చేరడంతో కుమారస్వామి సారథ్యంలోని ప్రభుత్వం కూలిపోయింది. దీంతో అప్పట్లో భాజపా సీనియర్ నేత యడియూరప్ప నేతృత్వంలో భాజపా ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.