పునరావాస చర్యలకు ‘మహా’సాయం
మహారాష్ట్రలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా మంగళవారం రూ.11,500 కోట్లు మంజూరు చేసింది. దెబ్బతిన్న మౌలిక వసతుల మరమ్మతులతోపాటు వరదల నివారణకు దీర్ఘకాలిక చర్యల కోసం వీటిని ఖర్చు చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
రూ.11,500 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర కేబినెట్
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్రలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయంగా మంగళవారం రూ.11,500 కోట్లు మంజూరు చేసింది. దెబ్బతిన్న మౌలిక వసతుల మరమ్మతులతోపాటు వరదల నివారణకు దీర్ఘకాలిక చర్యల కోసం వీటిని ఖర్చు చేయనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. జులై 21 నుంచి 23 వరకు కురిసిన అతి భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని రాయగఢ్, రత్నగిరి, సతారా, సాంగ్లీ, కొల్హాపూర్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. కొండచరియలు విరిగిపడటం తదితర ఘటనల్లో 200 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు లక్షలకుపైగా ప్రజలు తమ ఇళ్లను విడిచి, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ క్రమంలో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిర్వహణ విభాగం మంగళవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఎదుట ఈ విషయంలో ప్రజెంటేషన్ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి