మహారాష్ట్రలో కీలక నేతలకు భద్రత కుదింపు!
మహారాష్ట్రలో పలువురు కీలక ప్రతిపక్ష నేతల భద్రతపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ సహా, ఎంఎన్ఎస్(మహారాష్ట్ర నవనిర్మాన్ సేన) నాయకుడు రాజ్ఠాక్రే,, కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేలకు భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
ముంబయి: మహారాష్ట్రలో పలువురు కీలక ప్రతిపక్ష నేతల భద్రతపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ సహా, ఎంఎన్ఎస్(మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన) నాయకుడు రాజ్ఠాక్రే,, కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేలకు భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మీడియా వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించిన రెండు రోజుల అనంతరం ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.
‘వీఐపీలకు భద్రత కల్పించే అంశమై సమీక్ష నిర్వహించడం నిరంతర ప్రక్రియ. 2019లో చివరిసారి సమీక్ష జరిగింది. కొవిడ్ కారణంగా 2020లో నిర్వహించలేదు. కొందరు వీఐపీలకు తాము చేపట్టిన పదవుల కారణంగా ముప్పు పొంచి ఉంటుంది. ఒకవేళ వారు ఆ పదవుల నుంచి వైదొలిగితే ముప్పు పరిస్థితి కూడా మారుతుంది’ అని సమీక్షలో పాల్గొన్న ఓ సీనియర్ అధికారి తెలిపారు. కాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై భాజపా తీవ్ర విమర్శలు చేసింది. ఉద్ధవ్ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని భాజపా నేత రామ్ కదమ్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి ఫడణవీస్ స్పందిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తన పర్యటనలు, ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నారు.
మహారాష్ట్ర మాజీ సీఎం ఫడణవీస్కు ఇప్పటి వరకూ బుల్లెట్ప్రూఫ్ వాహనంతో కూడిన ‘జెడ్ ప్లస్’ భద్రత ఉండేది. ఇప్పుడు ‘వై ప్లస్’ కేటగిరీ భద్రతకు కుదించారు. దీంతో ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకోనుంది. ఫడణవీస్ సతీమణి అమృతతో పాటు, ఆయన కుమార్తె దివిజల భద్రతను ‘వై ప్లస్’ నుంచి ‘ఎక్స్’ కేటగిరీకి కుదించారు. అదేవిధంగా ఎంఎన్ఎస్ నేత రాజ్ఠాక్రే భద్రతను ‘జెడ్’ కేటగిరి నుంచి ‘వైప్లస్’కు కుదించారు. కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలేకు ‘వై ప్లస్’ భద్రత ఇవ్వనుంది. గతంలో ఆయనకు ‘వై ప్లస్’ భద్రతతో పాటు ఎస్కార్ట్ కూడా ఉండేది. ఇంకా పలువురు ప్రతిపక్ష నేతలకు ప్రభుత్వం భద్రతను కుదిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?