punjab elections: సవాళ్లు విసురుకుంటున్న ఆప్.. కాంగ్రెస్ పార్టీలు!
వచ్చే ఏడాది పంజాబ్ సహా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. హామీల వర్షం కురిపిస్తున్నారు. అయితే, పంజాబ్లో అధికారమే
దిల్లీ: వచ్చే ఏడాది పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ హామీల వర్షం కురిపిస్తున్నారు. అయితే, పంజాబ్లో అధికారమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్న ఆప్కు కాంగ్రెస్ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ క్రమంలోనే ఇరు పార్టీల నేతలు విమర్శలతోపాటు సవాళ్లు.. ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా పంజాబ్ విద్యాశాఖ మంత్రి విసిరిన సవాల్ను కేజ్రీవాల్ స్వీకరించారు. పంజాబ్ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలంటూ ఘాటుగా స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఇటీవల దిల్లీ విద్యాశాఖ మంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా పంజాబ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విమర్శలు చేస్తూ.. దిల్లీ, పంజాబ్లో పది చొప్పున పాఠశాలలను ఎంపిక చేసి వాటి పరిస్థితిని సమీక్షిద్దామని, ఏ పాఠశాలలు మెరుగ్గా ఉన్నాయో చూద్దామని సవాల్ విసిరారు. దీనికి స్పందించిన పంజాబ్ విద్యాశాఖ మంత్రి పర్గత్ సింగ్ ‘పది కాదు, 250 పాఠశాలల స్థితిగతులు పరిశీలిద్దాం.. మీరు సిద్ధమా?’అని ఆప్ నేతలకు సవాల్ విసిరారు. ఆప్ ప్రభుత్వం కేవలం పది పాఠశాలలకే బడ్జెట్ కేటాయించి మెరుగు పర్చిందని.. వాటినే ప్రచారంలో వాడుకుంటుందని పర్గట్ సింగ్ విమర్శించారు. దిల్లీ, పంజాబ్లోని పాఠశాలల మౌలిక వసతుల గురించి చర్చ జరగాలని అన్నారు.
పర్గత్ సింగ్ సవాల్ను కేజ్రీవాల్ స్వీకరించారు. విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా దిల్లీలోని 250 పాఠశాల జాబితాను విడుదల చేస్తారని, పర్గత్ కూడా పంజాబ్లోని 250 పాఠశాలల జాబితాను విడుదల చేస్తే చర్చకు వస్తామని ప్రకటించారు. మరి దీనిపై పర్గత్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
► Read latest Political News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా