Prashanth Kishore: ప్రస్తుత ప్రతిపక్షంతో భాజపాను ఓడించలేం: ప్రశాంత్ కిషోర్
భాజపాను ఓడించాలంటే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ను పునరుద్ధించాల్సిన అవసరం ఉందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. తాజాగా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆయన స్పందించారు. ఐదు నెలలపాటు చర్చలు జరిపినా.. ఆ పార్టీతో కలిసి
దిల్లీ: భాజపాను ఓడించాలంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ను పునరుద్ధించాల్సిన అవసరం ఉందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు. తాజాగా ఓ జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆయన స్పందించారు. ఐదు నెలలపాటు చర్చలు జరిపినా.. ఆ పార్టీతో కలిసి పనిచేయలేకపోవడానికి గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చారు.
‘‘కాంగ్రెస్ పార్టీ, నేను కలిసి పనిచేస్తే ఇతరులకు అది చూడటానికి చాలా సహజంగానే కనిపిస్తుంది. కానీ, మా మాధ్య పరస్పర విశ్వాసం ఉండాలి కదా.. అదే జరగలేదు. అందుకే కలిసి పనిచేయడం కుదర్లేదు. అయినా, కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోవాల్సిందే. ఆ పార్టీ లేకపోతే ప్రభావవంతమైన ప్రతిపక్షం సాధ్యపడదు. అయితే, ప్రస్తుత ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకత్వం భాజపాను ఓడించలేదు. ఆ పార్టీని ఓడించాలంటే ముందుగా కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది’’ అని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బలమైన కూటమి ఏర్పాటుకు తన వంతు సాయం అందించాలని ఆశపడుతున్నట్లు పీకే వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత