‘చస్తే చావండి’.. దుమారం రేపుతున్న మంత్రి వ్యాఖ్యలు
పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచుతున్నాయని మంత్రికి తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లిన ఆ తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. తల్లిదండ్రులపై మంత్రి మండిపడటం వివాదాస్పదంగా మారింది....
భోపాల్: పాఠశాలల యాజమాన్యాలు ఫీజులు పెంచుతున్నాయని మంత్రికి తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లిన ఆ తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. తల్లిదండ్రులపై మంత్రి మండిపడటం వివాదాస్పదంగా మారింది. ‘చస్తే చావండి’ అంటూ విద్యాశాఖ మంత్రి మండిపడుతున్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఏడాది పొడవునా పాఠశాలలు మూసే ఉన్నాయని.. ఆన్లైన్ తరగతులు నిర్వహించి పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని మధ్యప్రదేశ్కు చెందిన కొందరు తల్లిదండ్రులు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘మమ్మల్ని ఏం చేయమంటారు సర్.. చావమంటారా?’ అని ఆ తల్లిదండ్రులు మంత్రి ఇందర్సింగ్ పర్మార్ను అడిగారు. దానికి కోపోద్రిక్తుడైన పర్మార్ ‘చస్తే చావండి.. కావాలనుకుంటే ఆందోళన చేయండి’ అంటూ బదులివ్వడం వివాదాస్పదమైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్గా మారింది.
తమ బాధలు చెప్పుకునేందుకు మంత్రి వద్దకు వెళ్లిన బృందానికి అధ్యక్షత వహించిన కమల్ విశ్వకర్మ ఈ వ్యవహారంపై మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను లెక్కచేయకుండా పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయాన్ని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లాలనుకున్నాం. 60 మందితో కూడిన బృందం మంత్రి పర్మార్ ఇంటికి వెళ్లాం. దాదాపు గంటన్నర వేచిచూడగా.. మంత్రి కార్యాలయానికి చెందిన ఓ అధికారి మా వద్దకు వచ్చారు. ఓ నివేదికను సమర్పించి మంత్రిని కలవాలని ఆ అధికారికి తెలియజేశాం. కొద్దిసేపటికే మంత్రి ఇంట్లో నుంచి బయటకువచ్చారు. 60 మంది ఆయన కోసం ఎదురుచూస్తున్నా.. మమ్మల్ని పట్టించుకోకుండా ఆయన నేరుగా తన కారు వద్దకు వెళ్లారు. పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని.. సమస్యను పరిష్కరించాలని మేము ఆయన వద్దకు వెళ్లి వేడుకున్నాం. ఇందుకు వెంటనే వెటకారంగా ‘‘మేము సమస్యలు సృష్టిస్తాం’’ అని సమాధానమిచ్చారు’ అని కమల్ వెల్లడించారు.
మంత్రి పర్మార్ వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. మంత్రి రాజీనామా చేయాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలూజ డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను డిమాండ్ చేశారు. ‘ఏం చేసుకుంటారో చేసుకోండి.. చస్తే చావండి అని మంత్రి మాట్లాడటం మధ్యప్రదేశ్ ప్రభుత్వ అహంకారానికి నిదర్శనం’ అని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జితూ పట్వారీ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
నెల్లూరు జిల్లాలో అధికార పార్టీకి వాలంటీర్లు దూరమవుతున్నారు. -
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
First phase of LS polls: లోక్సభ ఎన్నికల తొలి విడతలో.. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఓటింగ్ జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 50శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. -
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
భారాస అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. -
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు నామినేషన్ల పర్వం సందడిగా సాగింది. -
తెలంగాణలో నామినేషన్ల సందడి.. ర్యాలీలతో హోరెత్తించిన అభ్యర్థులు
తెలంగాణలో నామినేషన్ దాఖలు ప్రక్రియ ఊపందుకుంది. వివిధ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు. -
జగన్ ప్రభుత్వం.. శిలాఫలకాల ప్రభుత్వం: వైఎస్ షర్మిల
రాష్ట్ర మంతా వైకాపా మాఫియా రాజ్యమేలుతోందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
కారు షెడ్డు నుంచి బయటకు రాదు.. పాడైపోయిందని భారాసను ఉద్దేశించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. -
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘ఇద్దరు యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ (PM Modi) శుక్రవారం అన్నారు. -
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
తెదేపా అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి నామినేషన్ వేశారు. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. -
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
Lok sabha Elections: తొలి విడత ఎన్నికలు జరుగుతున్న పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలు చోటుచేసుకున్నాయి. -
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి