ఏపీలోనే ఎక్కువ కరోనా పరీక్షలు: బుగ్గన

కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలని సీఎం జగన్ ఆలోచనలు చేస్తుంటే..  చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని...

Updated : 02 May 2020 00:53 IST

విజయవాడ: కరోనా వైరస్‌ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలని సీఎం జగన్ ఆలోచనలు చేస్తుంటే..  చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కువ కరోనా పరీక్షలు చేస్తున్నది రాష్ట్రంలోనే అని వివరించారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు హైరిస్క్‌ జోన్లుగా ఉన్నాయని తెలిపారు. 

ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనా పరీక్షల కోసం 9 ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని, త్వరలో నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాలో కూడా ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఎక్కువ పరీక్షలు చేయడం ద్వారా ఎక్కువ మంది బాధితులను గుర్తిస్తున్నామన్నారు. నెలరోజుల్లో టెస్టింగ్‌ సామర్థ్యాన్ని పెంచుకోగలిగామని తెలిపారు. కరోనాకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి వివరాలతో నివేదికలు వెల్లడిస్తున్నామని స్పష్టం చేశారు. వేరే రాష్ట్రాల నుంచి రావడం వల్ల కొన్ని జిల్లాల్లో కేసులు పెరిగాయని బుగ్గన తెలిపారు. కరోనాతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 33 మంది చనిపోయారని, వారంతా ఇతర వ్యాధులతో బాధపడేవారు, ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లేనని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని