ఎస్‌ఈసీ కేవియట్‌ ఎందుకు వేసింది: బుగ్గన

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక ఎన్నికలు వాయిదా వేసేముందు ప్రభుత్వంతో

Published : 22 Mar 2020 01:45 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక ఎన్నికలు వాయిదా వేసేముందు ప్రభుత్వంతో ఎస్‌ఈసీ చర్చించారా? అని ప్రశ్నించారు.  రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖకు లేఖరాయడమేంటని మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే మంత్రి పదవులు పోతాయని సీఎం హెచ్చరించినట్లు ఎస్‌ఈసీ లేఖలో పేర్కొన్నారు..ఆయన వద్ద ఆధారాలు ఉన్నాయా అని నిలదీశారు. ఇలాంటి లేఖలు ఎన్నికల కమిషనర్‌ రాయకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖకు లేఖ రాశారో లేదో ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ తేల్చి చెప్పాలని ఆర్థికమంత్రి బుగ్గన డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు సీఎం జగన్‌ అనేక చర్యలు తీసుకుంటున్నారని వివరించారు.

‘‘ కరోనా గురించి తెలుసు కనుకే ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది. కరోనా వల్ల వాయిదా వేస్తే  ఎన్నికల కోడ్‌ ఆరు వారాలపాటు ఎందుకు ఉంచారు?. ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు కోడ్‌ అడ్డు రాదా? కరోనాపై సీఎస్‌, వైద్యశాఖ అధికారులతో సమీక్ష జరిపారా?. స్థానిక ఎన్నికలు ఆపాలని ఎవరైనా కుట్ర చేస్తున్నారా? ఎన్నికలు ఆపేందుకు తోమర్‌ కేసును ఎందుకు వాడుతున్నారు. స్థానిక ఎన్నికలు పెట్టేముందు ప్రభుత్వంతో సంప్రదించాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఎస్‌ఈసీ బాధ్యతగా పనిచేయాలి. సుప్రీంకోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ కేవియట్‌ ఎందుకు దాఖలు చేశారు. ఇదేమైనా వ్యక్తిగత వివాదమా?.  మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలపై నిందలు వేస్తున్నారు. గత ఎన్నికల కమిషనర్‌ జేకే ద్వివేదీపై చంద్రబాబు ఎలా మాట్లాడారు? డోన్‌ నియోజకవర్గం గురించి చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారు’’ అని మంత్రి బుగ్గన ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని