ఏపీ ఆర్థిక పరిస్థితి బాగోలేదు: బుగ్గన
రాష్ట్రానికి అవసరమైన ఆర్థికసాయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించినట్లు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. దిల్లీలో నిర్మలాసీతారామన్తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థలకు...
దిల్లీ: రాష్ట్రానికి అవసరమైన ఆర్థికసాయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించినట్లు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి తెలిపారు. దిల్లీలో నిర్మలాసీతారామన్తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థలకు సుమారు రూ.5వేల కోట్ల నిధులు రావాల్సి ఉందని.. వాటిని వెంటనే విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. కేంద్రం నుంచి గ్రాంటు రాకపోవడంతో రాష్ట్ర ఖజానాపై ప్రభావం పడిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే విధంగా వైకాపా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేసిన రూ.3వేల కోట్లు రీయింబర్స్ కావాల్సి ఉందని.. ఆ నిధులు త్వరితగతిన విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ను కోరినట్లు బుగ్గన వివరించారు. మరోవైపు జిల్లాల్లో వాటర్గ్రిడ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సహకారం అందించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కోరామని తెలిపారు. వ్యవసాయం, నీటిపారుదల, తాగునీరు అంశాలపై నీతిఆయోగ్ నిపుణులతో చర్చించామన్నారు. ఆర్థికమాంద్యం ప్రభావం రాష్ట్రంపైనా ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. గత ప్రభుత్వం చేసిన అప్పులు చెల్లించడానికి మరో మూడేళ్లు పడుతుందని చెప్పారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల చిన్న ఘర్షణలు సహజమని ఆయన వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?