నితీష్ కుమార్పై ప్రశాంత్ కిషోర్ విమర్శలు
దిల్లీ అల్లర్లలో 46 మంది ప్రాణాలు కోల్పోతే వారి గురించి బీహార్ ముఖ్య మంత్రి నితీష్ కుమార్ మాట్లడకపోవడం బాధాకరం అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విటర్.....
పాట్నా: దిల్లీ అల్లర్లలో 46 మంది ప్రాణాలు కోల్పోతే వారి గురించి బీహార్ ముఖ్య మంత్రి నితీష్ కుమార్ మాట్లడకపోవడం బాధాకరమని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా నితీష్ కుమార్పై విమర్శలు చేశారు. ‘‘నితీష్ కుమార్ రాబోయే ఎన్నికల్లో 200 స్థానాలు గెలుచుకుంటామని నిన్న పట్నాలో జరిగిన బహిరంగసభలో కార్యకర్తలకు వాగ్దానం చేశారు. కానీ తన 15 ఏళ్ల సుదీర్ఘ పాలనలో కూడా ఇప్పటికీ ఎందుకు పేద రాష్ట్రంగా ఉందనే విషయం గురించి మాత్రం మాట్లడటం లేదు. దిల్లీ అల్లర్ల గురించీ ఆయన ఒక మాట కూడా మాట్లడకపోవడం ఎంతో బాధాకరం’’ అని ట్వీట్ చేశారు.
నిన్న పాట్నాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో నితీష్ కుమార్ మాట్లాడుతూ ‘‘ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ప్రజలు వలస వెళ్లడాన్ని ఒక సమస్యగా చూడకూడదు. దేశం అంతా ఒక్కటే. ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి స్వేచ్ఛగా వెళ్లొచ్చు’’ అని అన్నారు. ఉద్యోగకల్పన కోసం తమ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను పరిశీలించాలని ప్రతిపక్షాలను నితీష్ కుమార్ సవాల్ చేశారు. నిరుద్యోగం కారణంగానే బీహార్ యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారని ప్రశాంత్ కిషోర్, కన్హయ్య కుమార్ వంటి నాయకులు ఇటీవల నితీష్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. మరో పక్క ప్రశాంత్ కిషోర్ ‘బాత్ బీహార్ కీ’ అనే కార్యక్రమం ద్వారా దేశంలో పది అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా బీహార్ను తీర్చి దిద్దడమే లక్ష్యంగా పని చేస్తామని అక్కడి యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఏడాది బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ల కోలాహలం షురూ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
ఇటీవల తన తల్లి మృతి నేపథ్యంలో హమీర్పుర్ సీటు తనకు ఇచ్చినా పోటీ చేసే ఉద్దేశం లేదని డిప్యూటీ సీఎం కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె