కావాలంటే అన్నీ విశాఖలోనే పెట్టండి: అయ్యన్న
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ నుంచి లూలూ, అదానీ కంపెనీలు పారిపోయాయని...
విశాఖ: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ నుంచి లూలూ, అదానీ కంపెనీలు పారిపోయాయని దుయ్యబట్టారు. అసెంబ్లీకి దొడ్డిదారిన.. హైకోర్టుకు మాత్రం రాజమార్గంలో కాన్వాయ్లో సీఎం జగన్ వెళతారని ఎద్దేవాచేశారు. ఇప్పుడు మూడు రాజధానులకు మద్దతు పలుకుతున్న మంత్రి బొత్సకు.. గతంలో మంత్రిగా పనిచేసినప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి కనిపించలేదా? అని ప్రశ్నించారు.
అమరావతి నుంచి రాజధాని మారే ప్రసక్తే లేదని అయ్యన్నపాత్రుడు స్పష్టంచేశారు. రాజధాని గురించి మేనిఫెస్టోలో ఎక్కడా చెప్పకుండా.. ఇవాళ ఎవరు కోరారని రాజధాని మారుస్తున్నారని సీఎం జగన్ను నిలదీశారు. అసెంబ్లీ అమరావతిలో, సెక్రటేరియట్ విశాఖలో ఉంటే పరిపాలన సజావుగా ఎలా సాగుతుందని ప్రశ్నించారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని తమ నినాదమని చెప్పారు. కావాలంటే విశాఖలోనే సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు అన్నీ పెట్టాలని సూచించారు. రాజధాని విశాఖకు వస్తే అమరావతిలో ఉన్న ఉద్యోగులు ఇక్కడకు వస్తారే తప్ప పెద్దగా మార్పేమీ ఉండదన్నారు. నిజంగా విశాఖను అభివృద్ధి చెయ్యాలనుకుంటే పరిశ్రమలు తీసుకురావాలని ప్రభుత్వానికి హితవు పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!