రాజధాని పోరు: లోకేశ్‌ బైక్‌పై సీపీఐ నారాయణ

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన 31వ రోజూ కొనసాగుతోంది. రైతులు, మహిళలు వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారు. అమరావతి

Updated : 13 Sep 2023 16:38 IST

మంగళగిరి: అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన 31వ రోజూ కొనసాగుతోంది. రైతులు, మహిళలు వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారు. అమరావతి రైతులకు మద్దతుగా గుంటూరు జిల్లా మంగళగిరిలో రాజకీయ ఐకాస   ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, సీపీఐ నేతలు నారాయణ, ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీతారామ కూడలి నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు సాగిన ఈ ర్యాలీలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణను లోకేశ్‌ తన బైక్‌పై కూర్చోబెట్టుకొని ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీలో మంగళగిరి పరిధిలోని గ్రామాల నుంచి రైతులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని