బుగ్గనపై రూ.10కోట్ల పరువునష్టం దావావేస్తా

తన మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేసిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిపై రూ.10కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్లు భాజపా నేత, మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు తెలిపారు.

Published : 07 Jan 2020 00:28 IST

మాజీ మంత్రి రావెల

విజయవాడ: తన మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆరోపణలు చేసిన ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిపై రూ.10కోట్ల పరువు నష్టం దావా వేయనున్నట్లు భాజపా నేత, మాజీ మంత్రి రావెల కిశోర్‌ బాబు తెలిపారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని తరలించేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అందులో భాగంగానే తనకు రాజధాని ప్రాంతంలో భూములున్నాయని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. బినామీ భూములున్నాయంటూ..రాజధానిని తరలించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఒక అడ్రస్‌ లేకుండా చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అమరావతిని 5 కోట్ల ఆంధ్రుల అభివృద్ధికి, భవిష్యత్‌కు చిరునామాగా ఆయన అభివర్ణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని