UP Polls: అందుకే భాజపాను వీడా.. ఎస్పీలో చేరిన మూడో మంత్రి!
యూపీలో ఎన్నికల వేళ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తన మంత్రి పదవితో పాటు భాజపా సభ్యత్వానికి రాజీనామా చేసిన దారా సింగ్ చౌహాన్ ......
లఖ్నవూ: యూపీలో ఎన్నికల వేళ కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల తన మంత్రి పదవితో పాటు భాజపా సభ్యత్వానికి రాజీనామా చేసిన దారా సింగ్ చౌహాన్ ఆదివారం సమాజ్వాదీ పార్టీలో చేరారు. ఆయనకు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానించారు. గత వారం రోజుల వ్యవధిలో భాజపాను వీడి సమాజ్వాదీ పార్టీలో చేరిన మూడో మంత్రి దారా సింగ్ చౌహాన్ కావడం గమనార్హం. ఇటీవల భాజపాకు గుడ్బై చెప్పిన మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సమాజ్వాదీలో చేరిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా దారాసింగ్ చౌహాన్ మీడియాతో మాట్లాడారు. 2017లో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదం ఇచ్చిందన్నారు. కానీ, అభివృద్ధి ఫలాలు కొందరికి మాత్రమే పరిమితమయ్యాయని విమర్శించారు. యూపీలో రాజకీయాలను మారుస్తామనీ.. అఖిలేశ్ యాదవ్ను మళ్లీ సీఎంని చేస్తామన్నారు. రాష్ట్రంలోని ఓబీసీ, దళిత వర్గాలు ఏకతాటిపైకి వస్తాయనీ.. మార్పు అనివార్యంగా జరుగుతుందన్నారు. భాజపాకు మద్దతు ఇచ్చిన బీసీ వర్గాలకు యోగి ప్రభుత్వంలో సరైన ప్రోత్సాహం లభించలేదన్నారు.
‘గత ఐదేళ్లుగా ఏం చేశారని ప్రజలు అడుగుతున్నారు. ప్రభుత్వం ఏదో చేస్తుందని వెనుకబడిన సమాజం ఓపికగా ఎదురు చూస్తోంది. కానీ ఆ సమాజ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించడం చూసి సమాజ్వాదీ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం’’ అని దారా సింగ్ చౌహాన్ అన్నారు. భాజపా పట్ల బ్రాహ్మణుల్లో కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం ఆధారంగా సమాన వాటా దక్కుతుందన్నారు. ఆయనతో పాటు అప్నా దళ్ ఎమ్మెల్యే ఆర్కే వర్మ కూడా ఈరోజు సమాజ్వాదీ పార్టీలో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం