అసోంలో సీఏఏ అమలు చేయం: రాహుల్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అసోంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయబోమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం అసోంలోని దిబ్రుఘర్ జిల్లాలో రాహుల్.......
గువాహటి: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అసోంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయబోమని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం అసోంలోని దిబ్రుఘర్ జిల్లాలో రాహుల్ పర్యటించారు. అక్కడి లాహోవల్ కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా అధికార భాజపాకు చురకలంటించారు. ఏ మతమూ విద్వేషాన్ని రెచ్చగొట్టమని చెప్పదని, భాజపా మాత్రం సమాజాన్ని విభజించడానికి మతాన్ని వాడుతోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అందుకు అనుగుణంగా నాగ్పూర్లోని శక్తి (ఆర్ఎస్ఎస్) వారిని నడిపిస్తోందని చెప్పారు. భాజపా పని విభజించడమైతే.. కాంగ్రెస్ బాధ్యత కలపడమని చెప్పారు. విద్వేషం, నిరుద్యోగానికి దగ్గరి సంబంధాలు ఉన్నాయని, ఒకటి పెరిగితే మరొకటి కచ్చితంగా పెరుగుతుందన్నారు.
అసోం ప్రజల సంపత్తిని భాజపా బయటి వ్యక్తులకు తాకట్టు పెడుతోందని రాహుల్ అన్నారు. తేయాకు తోటలు, గువాహటి విమానాశ్రయం ఇందులో భాగమేనన్నారు. వారు దేన్నైనా ప్రైవేటీకరణ చేయొచ్చని, రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు విద్యను మాత్రం చేయలేరని పేర్కొన్నారు. విద్య, వైద్యం వాణిజ్యపరం చేయడాన్ని తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. ఇప్పటికే మూడు నల్ల చట్టాలతో దేశానికి అన్నం పెట్టే వ్యవసాయాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. వీటిని ప్రశ్నించే వారిని భాజపా జైళ్లకు పంపుతోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య రక్షణకు యువత కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అసోంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఏఏ రద్దు సహా ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు, ప్రతి ఇంటికీ 200 యూనిట్ల ఉచిత కరెంట్, రోజు వారి కూలి రూ.365కు పెంచుతామని రాహుల్ హామీ ఇచ్చారు. శనివారం గువాహటిలో జరగబోయే సభలో ఈ మేరకు పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!