Polavaram: పెండింగ్ బిల్లులు రాబట్టండి: సీఎం
పోలవరం సహా రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ప్రాధాన్యతను బట్టి
అమరావతి: పోలవరం సహా రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టుల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ప్రాధాన్యతను బట్టి ప్రాజెక్టులు పూర్తి చేయాలని.. ఎక్కడా ఆలస్యం చేయొద్దని అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన జలవనరుల శాఖపై సమీక్షించారు. రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టులు, పల్నాడు ప్రాంత కరవు నివారణ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టులపై సమీక్షించారు. కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. దాదాపు రూ.1600కోట్లు పెండింగ్లో ఉన్నాయని.. దిల్లీ వెళ్లి వెంటనే పెండింగ్ బిల్లులు క్లియర్ అయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు. పోలవరంలో స్పిల్వే కాంక్రీటు పనుల్లో 91శాతం అయ్యాయని.. ఈ నెలాఖరు నాటికి స్పిల్ ఛానల్ పనులు పూర్తవుతాయని వివరించారు.
కాఫర్ డ్యామ్లో 1, 2 రీచ్లు జూన్ నెలాఖరునాటికి, 3, 4 రీచ్ పనులు జులై నెలాఖరు నాటికి నిర్ణీత ఎత్తుకు పూర్తిచేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఫలాలు వీలైనంత త్వరగా అందించాలనే తపనతో ప్రభుత్వం ఉందని చెప్పారు. వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణంపైనా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. నెల్లూరు బ్యారేజీ నిర్మాణం జులై 31 నాటికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
ఎన్నికల వేళ వైకాపాకు మరో షాక్ తగిలింది. దళిత వర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. -
రాజ్యసభ సభ్యులుగా మరో ముగ్గురి ప్రమాణం
రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన మరో ముగ్గురు భాజపా సభ్యులు గురువారం ప్రమాణం చేశారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పార్లమెంటులో వారందరితో ప్రమాణం చేయించారు. -
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనబాక లక్ష్మి
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. -
అప్పుల కోసం జీఎస్డీపీని పెంచేశారు
అప్పుల కోసం రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)ని వైకాపా ప్రభుత్వం విపరీతంగా పెంచి చూపుతోందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
దిల్లీ మేయర్ ఎన్నికలు వాయిదా
వివాదాస్పదంగా మారిన దిల్లీ నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఎన్నికలు శుక్రవారం జరగాల్సి ఉంది. -
వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) గురువారం షెడ్యూలు విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!