Chandrababu: క్షేత్రస్థాయిలో తేల్చుకున్నాకే మళ్లీ అసెంబ్లీకి వెళ్తా: చంద్రబాబు

వైకాపా అరాచకపాలనపై తాను చేస్తున్న ధర్మపోరాటానికి ప్రజలంతా

Updated : 19 Nov 2021 14:46 IST

అమరావతి: వైకాపా అరాచకపాలనపై తాను చేస్తున్న ధర్మపోరాటానికి ప్రజలంతా సహకరించాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని.. అంతవరకూ వెళ్లనన్నారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘ఈ విషయాన్ని సభలోనే చెప్పాలనుకున్నా. అసెంబ్లీలో మైక్‌ ఇవ్వలేదు.. అందుకే ఇక్కడ చెబుతున్నా. ప్రజల్లో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తా. ప్రజలు సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తా’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని