MLC Elections: కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్పై కేసు నమోదు
రీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్పై కేసు నమోదు అయింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆయనపై కరీంనగర్ గ్రామీణ ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. రవీందర్ సింగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర ...
కరీంనగర్: కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్పై కేసు నమోదు అయింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని ఆయనపై కరీంనగర్ గ్రామీణ ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. రవీందర్ సింగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా కరీంనగర్లో బరిలోకి దిగారు. మీడియా సమావేశంలో ఓటర్లు రూ.10 లక్షలు డిమాండ్ చేసి తీసుకున్నా.. ఓటు మాత్రం తనకే వేయాలని రవీందర్ సింగ్ అన్నట్లు ఎంపీడీవో ఫిర్యాదు చేశారు. దీంతో ఎంపీడీవో ఫిర్యాదు మేరకు రవీందర్సింగ్పై కేసు నమోదు అయింది.
తెరాసలో ఉండి కరీంనగర్ మేయర్గా ఎన్నికైన రవీందర్ సింగ్ ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ వస్తుందనే ఆశతో ఆయన ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెరాస తరఫున ఎల్. రమణ, టి.భాను ప్రసాద్రావును పార్టీ బరిలోకి దించింది. దీంతో తనకు టికెట్ రాకపోవడంతో రవీందర్సింగ్ పార్టీకి రాజీనామా చేసి స్వంతత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?