బిహార్ ప్రజలే నా కుటుంబం: నితీశ్ కుమార్
బిహార్ సీఎం నీతీశ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో చురుకుగా దూసుకెళ్తున్నారు. ఓవైపు తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూనే.. మరోవైపు ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. మంగళవారం రెండో వర్చువల్ ర్యాలీలో పాల్గొన్న నీతీశ్ రాష్ట్రంలో రిజర్వేషన్ల ద్వారా తమ ప్రభుత్వం వెనకబడిన వర్గాల ఆదుకున్న విషయాన్ని గుర్తుచేశారు.
పట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో చురుకుగా దూసుకెళ్తున్నారు. ఓవైపు తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూనే.. మరోవైపు ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. మంగళవారం రెండో వర్చువల్ ర్యాలీలో పాల్గొన్న నితీశ్ రాష్ట్రంలో రిజర్వేషన్ల ద్వారా తమ ప్రభుత్వం వెనకబడిన వర్గాలను ఆదుకున్న విషయాన్ని గుర్తుచేశారు. ‘మా ప్రభుత్వ హయాంలో బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయ సేవల కోసం 50శాతం రిజర్వేషన్లు కేటాయించాం. స్థానిక ఎన్నికల్లోనూ ఈబీసీ (ఆర్థికంగా వెనకబడిన కులాల)వారికి రిజర్వేషన్లను కల్పించాం. ప్రతిపక్షాలు ఈ నిర్ణయాల్ని వ్యతిరేకించాయి. కొందరైతే ఏకంగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. కానీ చివరకు ఆ నిర్ణయాలు సరైనవేనని మేం నిరూపించాం. సామాజికంగా వెనబడిన వర్గాల వారికి ఉద్యామీ యోజన పథకం ద్వారా ఆర్థిక సాయం చేశాం’అని తెలిపారు.
మహిళల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ.. ‘మహిళల్లో సాధికారత తెచ్చేందుకు పంచాయతీ, సహకార సంఘాల్లో వారికి 50శాతం రిజర్వేషన్లు కల్పించాం. పాఠశాల విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ చేసినప్పుడు కూడా ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయి. మేం అధికారంలోకి వచ్చినపుడు 9వతరగతి బోర్డు పరీక్షలకు లక్ష మంది బాలికలు మాత్రమే హాజరయ్యారు. కానీ తాజాగా నిర్వహించిన బోర్డు పరీక్షల్లో 9లక్షలకు పైగా బాలికలు పరీక్షలకు హాజరయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీసు శాఖలో మహిళలకి అవకాశాలు కల్పించాం. కేవలం రిజర్వేషన్ల కారణంగానే ఇది సాధ్యమైంది’ అని పేర్కొన్నారు.
ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వస్తే బాలికలకు పాఠశాల విద్య పూర్తి చేసిన బాలికలకు రూ.25వేలు, కళాశాల విద్య పూర్తి చేసిన బాలికలకు రూ.50వేలు ఇస్తామని ఇదివరకే హామీ ఇచ్చారు. అదేవిధంగా భగల్పూర్ అల్లర్లలో నష్టపోయిన మైనారిటీలకు సైతం తమ ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకుందని చెప్పారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన నాయకులు మైనారిటీల ఓట్లు ఉపయోగించుకున్నారు కానీ.. వారి కోసం ఏం చేయలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలకు వారి కుటుంబమే ముఖ్యం.. కానీ నాకు మాత్రం బిహార్ ప్రజలే కుటుంబసభ్యులు అని వెల్లడించారు. బిహార్ శాసనసభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట